EPAPER

Tirumala : నడకదారిలో చిరుతల సంచారం.. ఎన్ని ఉన్నాయంటే..?

Tirumala : నడకదారిలో చిరుతల సంచారం.. ఎన్ని ఉన్నాయంటే..?

Tirumala : అలిపిరి నడకమార్గంలో చిరుతల సంచారం ఆందోళన కలిగిస్తోంది. దర్శనం కోసం వెళ్తున్న భక్తులపై తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఇద్దరు చిన్నారులపై చిరుతలు దాడి చేశాయి. ఓ బాలుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. మరో బాలికి చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తర్వాత భక్తులు హడలిపోతున్నారు. ఈ నేపథ్యంలో చిరుతలను బంధించే ఆపరేషన్ టీటీడీ అధికారులు చేపట్టారు. అలిపిరి మార్గంలో చిరుతలను పట్టుకునేందుకు ప్రత్యేక బోనులు ఏర్పాటు చేశారు.


దైవ దర్శనం కోసం వెళ్తున్న భక్తులు నడకమార్గంలో భయాందోళన చెందుతున్నారు. అయితే అలిపిరి మార్గంలో 8 చిరుతలు సంచరిస్తున్నాయని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను టీటీడీ ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ ఖండించారు. అందులో ఎంతమాత్రం నిజం లేదన్నారు. 8 చిరుతలు సంచారమనేది కేవలం రూమర్ మాత్రమేనని కొట్టిపారేశారు. ఇప్పటివరకు 4 చిరుతలను మాత్రమే గుర్తించామని చెప్పారు.

నడకదారి భక్తులకు ఎలాంటి ప్రమాదం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఫారెస్ట్ అధికారి తెలిపారు. చిరుతలను గుర్తించడానికి ప్రత్యేకంగా 220 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని వివరించారు. దీని వల్ల చిరుతల సంచారాన్ని సులభంగా గుర్తించవచ్చని అన్నారు. చిరుతల బెడదపై దీర్ఘకాలిక, శాశ్వత పరిష్కారం కోసం టీటీడీ చర్యలు తీసుకుంటుందన్నారు. అందుకే ఏపీ అటవీశాఖ అనుమతులతో చిరుతలను బంధించేందుకు ప్రత్యేక బోనుల ఏర్పాటు చేశామని తెలిపారు.


Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×