BigTV English
Advertisement

Chandrababu : నేడు గుడివాడలో “ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి” కార్యక్రమం..

Chandrababu : నేడు గుడివాడలో “ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి” కార్యక్రమం..

Chandrababu : ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు టూర్ కొనసాగుతోంది. గురువారం రెండోరోజు గుడివాడలో జరిగే ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించనున్నారు. అలాగే నిమ్మకూరులో జరిగే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లోనూ పాల్గొంటారు. చంద్రబాబు పాల్గొనే కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు టీడీపీ నాయుకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబు మూడురోజులు పర్యటిస్తారు.


‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం తొలిరోజు మచిలీపట్నంలో బుధవారం నిర్వహించారు. ఈ సభలో చంద్రబాబు ఏపీ ప్రభుత్వంపై నిప్పులు కక్కారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూకబ్జాలే జరుగుతున్నాయని ఆరోపించారు. మద్యం అమ్మకాల్లో రూ. 35 వేల కోట్లు జగన్‌ కొట్టేశారని విమర్శించారు. ఎనిమిదిసార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచారని.. చెత్తపైనా పన్ను వేశారని మండిపడ్డారు.

పులివెందులలో బస్టాండ్‌ కట్టలేని వ్యక్తి మూడు రాజధానులు కడతారా అంటూ చంద్రబాబు మండిపడ్డారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్రను అన్యాయంగా 55 రోజులు జైలులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.


Related News

Amadalavalasa: ఆముదాలవలస లో వైసీపీ ముక్కలవుతుందా?

Tirumala Annadanam: అంబటి ప్రశంస.. భూమనకు ఝలక్

Top 20 News @ 9 PM: గ్రోత్ హబ్‌గా విశాఖ, కేటీఆర్‌కి వ్యతిరేఖంగా పోస్టర్స్

Spurious Ghee: కోటి సంతకాల సంగతి దేవుడెరుగు.. ముందు కల్తీ నెయ్యిలోనుంచి బయటపడేదెలా?

CM Chandrababu: మంత్రులకు సీఎం చంద్రబాబు బిగ్ టాస్క్.. ఇక తప్పు జరిగితే రెస్పాన్సిబిలిటీ మినిస్టర్లదే: సీఎం చంద్రబాబు

AP Cabinet Decisions: రూ.లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.. మరిన్ని కీలక నిర్ణయాలు

Top 20 News @ 8 PM: కాంగ్రెస్ పార్టీపై హరీష్ రావు ఆరోపణలు, ఉపాధ్యాయుడు దాడి.. వినికిడి కోల్పోయిన విద్యార్ధి

Top 20 News @ 7 PM: ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్.. త్రిషా ఇంటికి బాంబు బెదిరింపు..!

Big Stories

×