EPAPER

Chandrababu : వడ్డీతో సహా చెల్లిస్తాం..గన్నవరంలో చంద్రబాబు గరంగరం..

Chandrababu : వడ్డీతో సహా చెల్లిస్తాం..గన్నవరంలో చంద్రబాబు గరంగరం..

Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు గన్నవరంలో పర్యటించారు. టీడీపీ నేత దొంతు చిన్నా కుటుంబ సభ్యులను పరామర్శించారు. దొంతు చిన్నా ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. అనంతరం ధ్వంసమైన టీడీపీ కార్యాలయాన్ని పరిశీలించారు.


పక్కా ప్లాన్ తో గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ సైకోలే ఈ దాడి చేశారని మండిపడ్డారు. కొంతమంది పోలీసు అధికారుల తీరును తప్పుపట్టారు. వాళ్ల వల్లే సమస్యలు వస్తున్నాయన్నారు. గన్నవరం పాకిస్థాన్ లో ఉందా అని ప్రశ్నించారు. తనను పర్యటించొద్దని ఎలా చెబుతారని నిలదీశారు.

బెదిరింపులకు భయపడేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. అరాచకాలపై పోరాడుతూనే ఉంటామన్నారు. రెచ్చగొట్టి తప్పుడు పనులు చేస్తే తమ ప్రభుత్వం వచ్చాక జైలుకు పోవాల్సిందేనని హెచ్చరించారు. అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తామని స్పష్టం చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డిని నమ్ముకున్న ఎందరో అధికారులు గతంలో జైలుకు వెళ్లారని గుర్తు చేశారు. ఇప్పుడు పోలీసులు కూడా అదే మార్గంలో వెళ్లవద్దని సూచించారు. ఎన్నివేల మంది వస్తారో రావాలి సవాల్ చేశారు. తాడోపేడో తెల్చుకుందామని చంద్రబాబు ఛాలెంజ్ విసిరారు.


ఉగ్రవాదుల కంటే ఘోరంగా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజా ఉద్యమానికి ప్రజలే ముందుకురావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు అందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు.

Related News

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు విప్పు జగన్.. ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Big Stories

×