Chandrababu : విజయనగరం బొబ్బిలిలో ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో వైసీపీ పార్టీ, జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేవు కానీ..పేపర్లలో ప్రకటనలు ఇస్తున్నారని తెలుగుదేశం అధినేత
చంద్రబాబు మండిపడ్డారు.
పార్లమెంట్లో ఆర్థికమంత్రి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసిన బాబు.. జగన్ సర్కారు తీరుపై ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలంతా విసుగెత్తిపోయారన్న టీడీపీ అధినేత… జగన్.. రంగుల ముఖ్యమంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి రాజకీయ చరిత్ర ఓ నకిలీ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మంత్రులు అవినీతి చేస్తున్నా…ముఖ్యమంత్రి.. ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారని దుయ్యబట్టారు.