Chandrababu’s visit to Delhi: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైనట్టు సమాచారం.
Chandrababu’s visit to Delhi: తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఖరారైనట్టు సమాచారం. బుధవారం రాత్రి అమరావతి నుంచి ఢిల్లీ వెళ్లనున్న సమాచారం. కేంద్ర పెద్దలతో విడివిడిగా సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు ఢిల్లీ టూర్ అంశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే ఒక అవగాహన వచ్చింది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు, పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన పేర్లు మాత్రం ఇంకా ప్రకటించలేదు.
ఈ క్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే ఆ రెండు పార్టీలు సీట్ల సర్దుబాటుపై బహిరంగ ప్రకటన చేయలేదని తెలుస్తోంది రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా టీడీపీతో పొత్తు మేలని బీజేపీ రాష్ట్ర నేతలు కొందరు అభిప్రాయపడుతున్నారు.
పొత్తుల అంశంపై స్పష్టత ఇవ్వాలని ఇటీవల విజయవాడలో జరిగిన బీజేపీ ముఖ్యనేతల సమావేశంలోనూ పలువురు నేతలు అభిప్రాయపడినట్లు తెలిసింది. ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు ఎవరిని కలుస్తారు? భాజపాతో పొత్తుపై స్పష్టత వస్తుందా? అనేది ఉత్కంఠగా మారింది.