Chandrababu Visits KCR | తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ని పరామర్శించారు.
తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం హైదరాబాద్లోని యశోద ఆస్పత్రిలో తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ని పరామర్శించారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి చంద్రబాబు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత కేసీఆర్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
కేసీఆర్ ఇటీవల ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్లో కాలు జారి కింద పడ్డారు. ఆ ప్రమాదంలో కేసీఆర్ తుంటి ఎముక విరగడంతో ఆయనకు యశోద ఆస్పత్రిలో సర్జరీ చేశారు. ఆపరేషన్ అనంతరం కేసీఆర్ 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లుభట్టివిక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నటుడు ప్రకాష్ రాజ్ దంపతులు యశోద ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్ను పరామర్శించారు.