E-Paper
Advertisement

Chandrababu: రైతు పోరుబాట.. చంద్రబాబు 12 కి.మీ. పాదయాత్ర..

Chandrababu: రైతు పోరుబాట.. చంద్రబాబు 12 కి.మీ. పాదయాత్ర..
Advertisement
cbn farmers

Chandrababu: తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు రైతు పోరుబాట చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం నుంచి ప్రారంభమైన చంద్రబాబు పాదయాత్ర.. అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని.. మూడు రోజుల్లో ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఇటీవల పశ్చిమగోదావరి పర్యటనలో ప్రభుత్వానికి చంద్రబాబు డెడ్‌లైన్‌ విధించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పోరుబాట పేరుతో చంద్రబాబు పాదయాత్ర ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతున్న చంద్రబాబు పర్యటన ఇరగవరం నుంచి తణుకు వై జంక్షన్‌ వరకు పాదయాత్ర సాగింది.. సుమారు 12 కిలో మీటర్లు పాదయాత్ర చేసిన చంద్రబాబు.. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

Advertisement

రైతు పోరుబాట ప్రారంభమానికి ముందు ఇరగవరం ఆంజనేయస్వామి ఆలయంలో చంద్రబాబు పూజలు నిర్వహించారు. అనంతరం పాదయాత్ర సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. ప్రభుత్వంపై మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం రైతులను సర్వనాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వైఫల్యంతోనే రైతులు రోడ్డెక్కారని.. తిరుగుబాటు చేస్తూ పోరాటానికి ముందుకొచ్చారన్నారు చంద్రబాబు.

కల్లాల్లోని ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేవరకు రైతుల పక్షాన పోరాడుతాని స్పష్టం చేశారు చంద్రబాబు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే విధంగా.. రైతులంతా చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. రైతు పోరుబాట, పాదయాత్ర.. వైసీపీ ప్రభుత్వానికి అంతిమయాత్ర అవుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×