EPAPER

Chandrababu Release Update: రాజమండ్రి టు ఉండవల్లి @14 గంటలు.. అడుగడుగునా బ్రహ్మరథం

Chandrababu Release Update: రాజమండ్రి టు ఉండవల్లి @14 గంటలు.. అడుగడుగునా బ్రహ్మరథం
Chandrababu Release Update

Chandrababu naidu news today(AP politics) :

టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన రాజమండ్రి జైలు నుంచి రోడ్డుమార్గంలో విజయవాడకు బయలుదేరగా.. టీడీపీ నేతలు,కార్యకర్తలు, అభిమానులు ఆయనకు దారిపొడవునా ఘన స్వాగతం పలికారు. ఆయన రాజమండ్రి నుంచి విజయవాడకు చేరుకునేందుకు 14 గంటలకు పైగా సమయం పట్టింది. అడుగడుగునా అభిమానులు బ్రహ్మరథం పట్టారు.


మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు షెడ్యూల్ మారింది. వాస్తవానికి ఇవాళ తిరుపతికి వెళతారని.. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకుని హైదరాబాద్‌కు వెళ్లాలని భావించారు. కానీ ఆయన నేరుగా హైదరాబాద్‌ వెళ్లనున్నారు. కోర్టు ఆదేశాలతో ఆయన అక్కడే వైద్య పరీక్షలు చేయించుకుంటారని.. ఎవరినీ కలవరని టీడీపీ నేతలు చెబుతున్నారు.

దాదాపు పద్నాలుగనర్న గంటల నిర్విరామ ప్రయాణం అనంతరం బుధవారం ఉదయం 5.45 గంటల సమయంలో చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. సుదీర్ఘ ప్రయాణంతో చంద్రబాబు అలసిపోయారు. చంద్రబాబు ఇంటికి చేరుకునే సరికే.. అక్కడ టీడీపీ నేతలు, కార్యకర్తలు, అమరావతి రైతులు, మహిళలు భారీగా గుమిగూడారు.పెద్దఎత్తున నాయకులు, మహిళలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని నినాదాలు చేశారు.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×