Chandrababu : గోదావరి జలాల్ని రాయలసీమకు చేర్చడమే తన జీవిత ఆశయం అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన చంద్రబాబు.. టీడీపీ హయాంలో పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించినప్పుడు కొందరు ఎగతాళి చేశారని చెప్పారు. ఇప్పుడు అనంతపురం వస్తున్న నీళ్లు పట్టిసీమవే అని తెలిపారు. హంద్రీనీవా ఫేజ్-2లో బుక్కపట్నం రిజర్వాయర్ పూర్తి చేశామని చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వం కనీసం కాలువలు తవ్వలేదని మండిపడ్డారు.
ఒక మూర్కుడు, ఒక అజ్ఞాని అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో జగన్ను చూస్తే అర్థం అవుతోందని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. వైసీపీకి పోయే టైమ్ దగ్గర పడిందని.. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని అన్నారు. జగన్ అధికారంలోకి రాగానే 365 GO ద్వారా రాయలసీమలో 102 ప్రాజెక్టులు ప్రీ క్లోజ్ చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం, పోలీసుల వేధింపులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. అక్రమ కేసులు పెట్టి.. పోలీసులు చిక్కుల్లో పడొద్దని హితవు పలికారు.