Chandrababu: మాజీ ప్రధాని వాజ్పేయీ జయంతి సందర్భంగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని బాబు గుర్తు చేసుకున్నారు. ఆధునిక భారత నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించిన మహనీయులలో వాజ్ పేయీ ముఖ్యులు అన్నారు.
మాజీ ప్రధాని వాజ్పేయీ జయంతి సందర్భంగా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని బాబు గుర్తు చేసుకున్నారు. ఆధునిక భారత నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించిన మహనీయులలో వాజ్ పేయీ ముఖ్యులు అన్నారు.
అత్యుత్తమ విధానాలతో దేశ గమనాన్ని మార్చిన నేత అన్నారు. వాజ్పేయీది రాజకీయాలకు అతీతంగా కీర్తించే వ్యక్తిత్వమని కొనియాడారు. ఆయనతో గడిపిన ప్రతిక్షణం నేర్చుకోవడానికి గొప్ప అవకాశమిచ్చిందని చంద్రబాబు గుర్తు చేశారు.