EPAPER

Chandrababu naidu: “ఎన్నికల ముందు ముద్దులు.. తర్వాత పిడి గుద్దులు..” జగన్ పై చంద్రబాబు సెటైర్లు..

Chandrababu naidu: “ఎన్నికల ముందు ముద్దులు.. తర్వాత పిడి గుద్దులు..” జగన్ పై చంద్రబాబు సెటైర్లు..

Chandrababu naidu: రాష్ట్రంలో ఎవ్వరికీ ధైర్యంగా మాట్లాడే స్వేచ్ఛ లేదు ఇది ఏం ప్రజాస్వామ్యం అని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరాచకాలు ఎక్కువ అయ్యాయి, రాష్ట్రాన్ని నియంతృత్వంగా పాలిస్తుస్తారని ద్వజమెత్తారు. వైసీపీలో 11 మంది ఇన్‌ఛార్జులను మార్చారు, 151 మందిని మార్చినా వైసీపీ అధికారంలోకి వచ్చే పరిస్థతి లేదన్నారు . అప్పుడే వైకాపాలో ప్రకంపనలు మొదలయి, ఎన్నికల ముందు ముద్దులు.. ఇప్పుడేమో పిడి గుద్దులు.. జగన్ అపరిచితుడిలా ప్రవర్తిస్తాడు చెప్పేది ఒక్కటి చేసేది ఒక్కటి అన్నారు.


రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని, పోలీసులతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వెనకబడిన వర్గాలను బలపరిస్తేనే సామాజిక న్యాయం జరుగుతుందని.. కానీ జగన్ అనగారిక వర్గాలను పట్టించుకునే పరిస్థతి ఏం మాత్రం కనిపించడంలేదన్నారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు.. మరి ఇప్పుడు హోదా ఏమయ్యిందని ప్రశ్నించారు.

టీడీపీ హయాంలో పోలవరం 72 శాతం పూర్తి చేశామని తాము అధికారంలో ఉండి ఉంటే 2020 నాటికి పోలవరం పూర్తి చేసేవాళ్లమన్నారు. పోలవరం పూర్తయితే ప్రతి ఎకరాకు నీళ్లు అందుతాయన్నారు. కానీ వైసీపీ పాలనలో పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుందో ఎవరికీ తెలియదన్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక సంప్రదాయాలను సర్వనాశనం చేశారన్నారు. జగన్ కి అమ్మ, చెల్లినే కలిసే సమయం ఉండదు. ఇక రాష్ట్ర ప్రజలను ఎప్పుడు కలుస్తారని విమర్శించారు. జగన్ కి ప్రతిపక్షాల మీద దాడి చేయడం తప్పా , రాష్ట్రాన్ని అభివృద్ది చేయడం తెలియదన్నారు.


తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరారు. చంద్రబాబు నాయుడు వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రామచంద్రాపురం, తంబళ్లపల్లి, ఉదయగిరి, తాడికొండ, మంత్రాలయం, కోవూరు నియోజకవర్గాల నుంచి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడంతో టీడీపీ కార్యాలయం కళకళలాడింది.

Related News

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు విప్పు జగన్.. ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Big Stories

×