Chandrababu : ఏపీలో ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోంది. అధికారమే లక్ష్యంగా వైసీపీ, టీడీపీ-జనసేన కూటమి పావులు కదుపుతున్నాయి. వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ ఛార్జల ప్రకటిస్తూ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచారు. అప్పటి నుంచి రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. వైసీపీ టిక్కెట్ దక్కని నేతలు పార్టీకి గుడ్ చెప్పేస్తున్నారు. జగన్ అత్యంత సన్నిహితులైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కూడా వైసీపీని వీడారు. గెలిచే ఛాన్స్ లేదంటే ఎలాంటి నేతనైనా జగన్ పక్కన పెట్టేస్తున్నారు.
Chandrababu : ఏపీలో ఎన్నికల వేడి రోజురోజుకు పెరుగుతోంది. అధికారమే లక్ష్యంగా వైసీపీ, టీడీపీ-జనసేన కూటమి పావులు కదుపుతున్నాయి. వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ ఛార్జల ప్రకటిస్తూ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచారు. అప్పటి నుంచి రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. వైసీపీ టిక్కెట్ దక్కని నేతలు పార్టీకి గుడ్ చెప్పేస్తున్నారు. జగన్ అత్యంత సన్నిహితులైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి కూడా వైసీపీని వీడారు. గెలిచే ఛాన్స్ లేదంటే ఎలాంటి నేతనైనా జగన్ పక్కన పెట్టేస్తున్నారు.
అటు టీడీపీ అధినేత చంద్రబాబు గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదునుపెడుతున్నారు. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు గెలుపు గుర్రాల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక కోసం
రా కదలిరా కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. హైదరాబాద్లో నేటి నుంచి పార్టీ ముఖ్య నేతలతో సమీక్షలు నిర్వహించనున్నారు. వారితో ఫస్ట్ లిస్టుపై మంతనాలు జరపనున్నారు.
అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్న టీడీపీ 70 మంది క్యాండిడేట్స్ తో మొదటి జాబితా విడుదల చేసే యోచనలో ఉందని తెలుస్తోంది. అటు జనసేన కూడా 15 మందితో ఫస్ట్ లిస్టు రిలీజ్ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
మరోవైపు ప్రచార వ్యూహాన్ని చంద్రబాబు సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 29 తర్వాత అమరావతిలో సభ నిర్వహించేందుకు పథక రచన చేస్తున్నారు. ఆ సభా వేదికపై 8 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరతారని తెలుస్తోంది.ఆ లోపే తొలిజాబితా విడుదల చేయాలన్న ప్రయత్నంలో ఉన్నారు చంద్రబాబు.