IPS officers: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీనియర్ ఐపీఎస్లను ట్రాన్స్ఫర్ చేసింది. 16 మంది ఐపీఎస్ అధికారులను ఒకేసారి బదిలీలు చేసింది. సీఐడీ చీఫ్గా వినీత్ బ్రిజ్లాల్, ఇంటెలిజెన్స్ విభాగం ఐజీగా రామకృష్ణ నియమించింది.
నిఘా విభాగం ఎస్పీ అట్టాడ బాబూజీని అక్కడి నుంచి బదిలీ చేయలేదు. అలాగని పోస్టింగ్ ఇవ్వలేదు. పోలీసు ప్రధాన కార్యాలంలో రిపోర్టు చేయాలని మాత్రమే ఆదేశించింది. గత ఐదేళ్లు ఆయన నిఘా విభాగంలోనే ఉన్నారు.
ప్రొవిజెన్స్ అండ్ లాజస్టిక్స్ విభాగం ఐజీగా ఎం రవి ప్రకాష్ను నియమించింది. ఐపీఎస్ అధికారి దీపిక రిక్వెస్ట్ మేరకు ఆమెను కాకినాడ బెటాలియన్ కమాండెంట్గా బదిలీ చేసింది ప్రభుత్వం. ఆమె భర్త విక్రాంత్ పాటిల్ కాకినాడ ఎస్పీగా ఉన్నారు. చానాళ్లుగా వెయిటింగ్లో ఉన్న మేరీ ప్రశాంతిని విశాఖ డీసీపీగా నియమించింది.
కొన్ని నెలలుగా వెయిటింగ్లో ఉన్న అమ్మిరెడ్డి, విజయరావు, ఎస్పీలు సిద్ధార్థ కౌశల్, మేరీ ప్రశాంతి, రాధిక అరిఫ్ హఫీజ్, తిరుమలేశ్వర్ రెడ్డలకు వివిధ విభాగాల్లో పోస్టింగులు ఇచ్చింది. వీరిలో అమ్మిరెడ్డి, విజయరావు, తిరుమలేశ్వర్ రెడ్డి, అరిఫ్ హఫీజ్ లు వైసీపీకి అనుకూలంగా పనిచేశారనే ఆరోపణలు లేకపోలేదు.
ALSO READ: సరిపోతుందా శనివారం, తేడా వస్తే మక్కెలిరగ దీస్తా.. డిక్లరేషన్ మాటేంటి?