Durga temple: తిరుమల లడ్డూ వివాదం ముగియక ముందే దుర్గ టెంపుల్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దుర్గగుడిలో నాసిరకం సరుకులపై వినియోగించడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ప్రస్తుతం అంతర్గత విచారణ జరుగుతోంది.
వైసీపీ హయాంలో చేసిన పనులు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కోట్లాది మంది భక్తులు వచ్చే దేవాలయాల్లో ప్రసాదాలు నాసిరకంగా ఉండడంపై చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై నాసిరకం సరుకుల వ్యవహారంపై దేవాదాయ శాఖలో అంతర్గత విచారణ జరుగుతోంది. రెండురోజుల తనిఖీల్లో రూ. 15 లక్షల రూపాయల విలువైన నాసిరకం సరుకులు గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ముఖ్యంగా అన్నదానం, లడ్డూ ప్రసాదం, స్టోర్స్లో పని చేస్తున్న ఉద్యోగుల పాత్రపై నివేదిక రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణాలు పాటించకపోవడంపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది. ఈ వ్యవహారంపై ఉద్యోగులు ఎందుకు సైలెంట్గా ఉన్నారనే దానిపై ఆరా తీస్తోంది. మరో నాలుగైదు రోజుల్లో రిపోర్టు ఆ శాఖ అందనుంది. ఆ తర్వాత విజిలెన్స్ విచారణ చేయిస్తుందా? అనేది తెలియాల్సివుంది.
ALSO READ: ఆంధ్రప్రదేశ్ లో బిగ్ టీవీ మెగా ఫ్రీ మెడికల్ క్యాంప్స్.. ఈ నెల 28,29 తేదీల్లో.. వివరాలు ఇవిగో
ఇదేకాకుండా అటు అన్నవరం, సింహాచలం దేవాలయాల్లో ఇదే సమస్య తలెత్తినట్టు వార్తలు వస్తున్నాయి. తిరుమల లడ్డూ వ్యవహారం వెలుగులోకి రాగానే అన్నవరం దేవాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే సందర్శించారు. నెయ్యిను తనిఖీకి పంపించారు. దానిపై రెండురోజుల్లో నివేదిక రానుంది. మొత్తానికి ఏపీ వ్యాప్తంగా దేవాలయాల్లో ప్రక్షాళన జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో ఇంకెంత మంది పేర్లు వెలుగులోకి వస్తాయో చూడాలి.
దుర్గగుడిలో నాసిరకం సరుకుల అంశంపై ప్రభుత్వం సీరియస్..
విజయవాడ ఇంద్రకీలాద్రిపై నాసిరకం సరుకుల వ్యవహారంపై దేవాదాయ శాఖ అంతర్గత విచారణ
2 రోజుల తనిఖీల్లో రూ.15 లక్షల విలువైన నాసిరకం సరుకులు గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు
అన్నదానం, లడ్డూ ప్రసాదం, స్టోర్స్ లో పనిచేస్తున్న ఉద్యోగుల… pic.twitter.com/ejWJGkkjo3
— BIG TV Breaking News (@bigtvtelugu) September 25, 2024