EPAPER

Jagan govt given highest ads to sakshi: జగన్ లెక్కలు బయటకు.. సాక్షికి రూ.403 కోట్లు, మిగతా 20 పేపర్లకు..

Jagan govt given highest ads to sakshi: జగన్ లెక్కలు బయటకు.. సాక్షికి రూ.403 కోట్లు, మిగతా 20 పేపర్లకు..

Jagan govt given highest ads to sakshi: వైసీపీ ప్రభుత్వంలోని కుంభకోణాలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఒక్కో‌ శాఖ గురించి కీలక విషయాలను కూటమి ప్రభుత్వం బయటపెడుతోంది. తాజాగా గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం నుంచి సాక్షికి ప్రకటన రూపంలో 403 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు సమాచారశాఖ మంత్రి పార్థసారథి అసెంబ్లీలో వెల్లడించారు.


ఈ వ్యవహారంపై హౌస్‌కమిటీ వేసి విచారణ చేయిస్తామన్నారు మంత్రి పార్థసారథి. దీనికి కారణమైన అధికారులను రిలీవ్ చేయకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. శుక్రవారం ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. దీనికి సంబంధించి మొత్తం డేటాను సభలో పెట్టారు. ఐదేళ్లలో ఒక్క సాక్షి పత్రికకు ఇచ్చిన ప్రకటనల ఖర్చు 403 కోట్లు. మిగతా 20 పత్రికలకు  ఇచ్చిన ప్రకటనలు రూ. 488 కోట్లు.

జగన్ ఐదేళ్ల పాలనలో వివిధ పత్రికలకు చేసిన ఖర్చు. ఈనాడు- రూ. 190 కోట్లు, సాక్షి రూ.293 కోట్లు, ఆంధ్రజ్యోతి- రూ.21 లక్షలు, ఆంధ్రప్రభ-14.5 కోట్లు, వార్త-13.71 కోట్లు, ప్రజాశక్తి-11.11 కోట్లు, హిందూ- 41 కోట్లు, న్యూఇండియన్ ఎక్స్‌ప్రెస్-30.03 కోట్లు, డీసీ-రూ. 40 కోట్లు, హాన్స్‌ఇండియా రూ.-7 కోట్లు, పయనీర్ – 9 కోట్లు రూపాయల యాడ్స్ ఇచ్చినట్టు తేలింది. డిజిటల్ యాడ్స్ ఐఎన్పీఆర్ పరిధిలో లేదన్నారు మంత్రి.


ALSO READ:  ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ ఇప్పుడు ఫైర్ లెస్ బ్రాండ్.. పత్తా లేని మాజీ మంత్రి రోజా

ఎక్కువ సర్కులేషన్లు ఉన్న పత్రికలకు జగన్ ప్రభుత్వంలో మొండిచేయి చూపినట్టు మంత్రి వెల్లడించిన వివరాల్లో బయటపడింది. ఇంకో కొత్త విషయం ఏంటంటే.. ప్రకటనలపై ప్రభుత్వం డిపార్ట్‌మెంట్ ఎంక్వైరీ వేసింది. కొన్ని పత్రికలకు పేమెంట్ పెండింగ్‌లో పెట్టారు. దీంతో వాళ్లు ప్రభుత్వ ప్రకటనలు తీసుకోలేదన్నది అసలు మేటర్. సచివాలయాల్లో సాక్షి పేపరు తీసుకోవాలన్న జీవో తమ శాఖ ఇవ్వలేదన్నారు.

ఇదిలావుండగా కేంద్రం నుంచి డిప్యుటేషన్‌ మీద ఏపీకి వచ్చారు పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్‌రెడ్డి. ప్రభుత్వం మారడంతో ఆయన కేంద్రసర్వీసులకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయన మీద వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ విచారణ చేయించాలని నిర్ణయించింది కూటమి ప్రభుత్వం. తాజాగా ఆయనకు మళ్లీ పోస్టింగ్ ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనిపై చంద్రబాబు సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

 

Related News

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Big Stories

×