Chandrababu: విజయవాడలోని గుణదల మేరీమాతను టీడీపీ అధినేత చంద్రబాబు , భువనేశ్వరి దంపతులు దర్శించుకున్నారు. మేరీమాత ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. అక్కడే ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి, భక్తులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
చంద్రబాబు దంపతులు తొలితగా విశాఖ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కార్యక్రమంలో వర్ల రామయ్య, దేవినేని ఉమ,జవహర్, కొల్లు రవీంద్ర, అశోక్ బాబు, నాగుల్ మీరా పాల్గొన్నారు.