ఈనెల 28న టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ను కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్లో దొంగ ఓట్ల వ్యవహారంపై ఫిర్యాదు చేయనున్నారు. ఇందుకోసం అపాయింట్మెంట్ కోరుతూ ఇప్పటికే టీడీపీ కార్యాలయం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.
ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ఓట్ల విషయంలో అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ ముందు నుంచి ఆరోపిస్తోంది. దొంగ ఓట్లను చేర్చడంతో పాటూ.. టీడీపీకి అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగిస్తోందని విమర్శిస్తోంది. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి.. టీడీపీ విజ్ఞప్తి చేయనుంది.
ఈ నెల 28న టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి.. కేంద్ర ఎన్నికల కమిషనర్ను స్వయంగా కలిసి.. దొంగ ఓట్ల చేర్పు, టీడీపీ ఓట్ల తొలగింపుపై.. అన్ని ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి.