Chandrababu : వైసీపీలో తిరుగుబాటు మొదలైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆ పార్టీ నుంచి పోటీ చేయాలంటేనే ఎమ్మెల్యేలు భయపడుతున్నారని చెప్పారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన ‘ రా.. కదలిరా’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు అయిపోగానే వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమన్నారు.
Chandrababu : వైసీపీలో తిరుగుబాటు మొదలైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆ పార్టీ నుంచి పోటీ చేయాలంటేనే ఎమ్మెల్యేలు భయపడుతున్నారని చెప్పారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన ‘ రా.. కదలిరా’ బహిరంగ సభలో మాట్లాడారు. ఎన్నికలు అయిపోగానే వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమన్నారు.
నడిరోడ్డుపై మహిళలను వైసీపీ నేతలు వేధిస్తున్నారని చంద్రబాబు అన్నారు. మహిళల జోలికి వస్తే అదే ఆ పార్టీకి చివరి రోజు అవుతాయని హెచ్చరించారు. జగన్ చెప్పేవన్నీ నీతులు.. చేసేవన్నీ సైకో పనులు అన్నారు. మాచర్లలో దుర్గారావు అనే కార్యకర్తను పోలీసులు వేధించారన్నారు. జగన్ పాలనలో అందరం బాధితులమే అని పేర్కొన్నారు. మనకు న్యాయ జరగాలంటే జగన్ ను ఓడించాలని పిలుపునిచ్చారు.
వైసీపీ పాలనలో పెద్దిరెడ్డికి ఒక న్యాయం.. ఆదిమూలంకు ఒక న్యాయమా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ ఐదేళ్లలో జగన్ ఉద్యోగ ఖాళీల భర్తీపై ఏనాడూ శ్రద్ధ పెట్టలేదన్నారు. ఉద్యోగాలు ఇవ్వక యువతను గంజాయికి బానిసలను చేసి యువత భవిష్యత్తు నాశనం చేశారని జగన్ పాలనపై చంద్రబాబు ధ్వజమెత్తారు.