Chandrababu : వచ్చే ఎన్నికల్లో టీడీపీని తిరుగులేని మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. పల్నాడు జిల్లా పొన్నూరులో నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జగన్ మార్క్ అంటూ కొత్త నాటకాలకు సీఎం తెరలేపారన్నారు. విద్యుత్ బిల్లులు, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచడన్నారు.
Chandrababu : వచ్చే ఎన్నికల్లో టీడీపీని తిరుగులేని మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోరారు. పల్నాడు జిల్లా పొన్నూరులో నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జగన్ మార్క్ అంటూ కొత్త నాటకాలకు సీఎం తెరలేపారన్నారు. విద్యుత్ బిల్లులు, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచడన్నారు.
రివర్స్ నిర్ణయాలతో రివర్స్ పాలన చేయడమే జగన్ మార్క్ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్ గంజాయి సరఫరాలో ఏపీని నంబర్ వన్గా చేసిన ఘనతా ఆయనకే దక్కుతుందని విమర్శలు గుప్పించారు. విద్యుత్ బిల్లులు, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచడాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో డ్వాక్రా మహిళలతో పొదుపు చేయించడం నా విజన్ అని చంద్రబాబు అన్నారు. పేద పిల్లల కోసం విదేశీ విద్య అందించడం నా మార్క్ అన్నారు. దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామన్నారు. రైతు బిడ్డలను లక్షాధికారులను చేయడం టీడీపీ పార్టీ మార్క్ అని చంద్రబాబు తెలిపారు. తనది విజన్ అయితే.. జగన్ది పాయిజన్ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.