E-Paper
Advertisement

Avinash Reddy: ఇప్పుడే విచారణకు రాలేను.. సీబీఐ నోటీసులపై అవినాష్ రెడ్డి రియాక్షన్

Avinash Reddy: ఇప్పుడే విచారణకు రాలేను.. సీబీఐ నోటీసులపై అవినాష్ రెడ్డి రియాక్షన్

Avinash Reddy: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ జారీ చేసిన నోటీసులపై వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు. ఒక రోజు ముందు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటే ఎలా అని ప్రశ్నించారు.

నాలుగు రోజుల పాటు ముందస్తుగా కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నందు వల్ల హాజరు కాలేనని సీబీఐకి విన్నవించారు. ఐదు రోజుల తర్వాత ఎప్పుడు రమ్మన్నా విచారణకు వస్తానని తెలిపారు. దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పారు.

హత్య కేసులో నా ప్రమేయం ఉందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. నాపై వచ్చిన అభియోగాలను జీర్ణించుకోలేకపోతున్నాను. తానంటే ఏమిటో ప్రజలకు పూర్తిగా తెలుసని అవినాష్ రెడ్డి అన్నారు. నిజం వెలుగులోకి రావాలి.. న్యాయం గెలవాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. తనపై ఆరోపణలు చేసే వారు ఒకసారి ఆలోచించాలని.. ఇలాంటి ఆరోపణలు చేస్తే మీ కుటుంబ సభ్యులు ఎలా ఫీల్ అవుతారో ఓ సారి ఊహించుకోవాలన్నారు.

ఇక ఇప్పటికే ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి సన్నిహితుడు దేవిరెడ్డి అరెస్ట్ అయ్యారు. దేవిరెడ్డి శంకర్ రెడ్డి నుంచి సీబీఐ అధికారులు కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది.

వివేకా హత్య కేసులో మొదటి నుంచీ ఎంపీ అవినాష్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తూనే ఉంది. హత్య జరిగిన ప్రదేశంలో రక్తపు మరకలు తుడిచేయించడం, ఆధారాలు ధ్వంసం చేయడం లాంటి చర్యలు చేశారంటూ అవినాష్ రెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయి. వివేకాను గొడ్డలితో నరికి చంపినా.. శరీరంపై తీవ్ర గాయాలు కనిపిస్తున్నా.. ఆయన గుండెపోటులో చనిపోయారంటూ అవినాష్ రెడ్డి మీడియాకు చెప్పడం అప్పట్లో కలకలం రేపింది.

వివేకా కూతురు సునీత సైతం అవినాష్ పై అనుమానాలు వ్యక్తం చేశారు. అప్రూవర్ గా మారిన నిందితుడు దస్తగిరి సైతం తన వాంగ్మూలంలో అవినాశ్ రెడ్డి పేరు ప్రస్తావించినట్టు చెబుతున్నారు. అవినాష్ రెడ్డి సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరైతే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.

CBI: వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు.. వివేకా హత్య కేసులో బిగుస్తున్న ఉచ్చు..

Varahi: అంజన్న చెంతకు వారాహి.. పవన్ కు కొండగట్టు సెంటిమెంటు ఎలానంటే..

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×