Avinash Reddy latest news(Andhra pradesh today news): కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ కోర్టు సమన్లు జారీచేసింది. వివేకా హత్యకేసులో సీబీఐ అనుబంధ చార్జ్షీట్ను పరిగణలోకి తీసుకుంది. ఆగస్టు 14న కోర్టుకు హాజరుకావాలని అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది.
వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ్కుమార్ రెడ్డిలపై ఇటీవలే అదనపు చార్జ్షీట్ వేసింది సీబీఐ. ఈ కేసులో అవినాష్ను 8వ నిందితుడిగా చేర్చింది. ఆరో నిందితుడిగా భాస్కర్రెడ్డి, ఏడో నిందితుడిగా ఉదయ్కుమార్రెడ్డి ఉన్నారు. వారిద్దరికీ ఆగస్టు 14 వరకు రిమాండ్ పొడిగించింది కోర్టు. ప్రస్తుతం ముందస్తు బెయిల్పై ఉన్న అవినాష్రెడ్డి.. ఆగస్టు 14న కోర్టుకు హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యతను సీబీఐకే అప్పగించింది న్యాయస్థానం.