Viveka Murder Case latest news(Andhra news updates): వివేకా హత్యకేసుపై సీబీఐ ఛార్జ్షీట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవినాష్రెడ్డి, భాస్కర్రెడ్డి కుట్ర చేశారని సీబీఐ వెల్లడించింది. కుట్ర, హత్య సాక్ష్యాల చెరిపివేశారని ఛార్జిషీట్లో వివరించింది. ఫోటోలు, గూగల్ టేకౌట్, ఫోన్ల లొకేషన్ డేటాను సీబీఐ కోర్టుకు సమర్పించింది.
వివేక హత్య కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. వివేకా PA కృష్ణారెడ్డిపై అనుమానాలున్నా ఇప్పటివరకూ ఆధారాలు లభించలేదని అన్నారు. సాక్ష్యాలు చెరిపివేసేటప్పుడు మనోహర్రెడ్డి ఉన్నా.. అతని ప్రమేయంపై నిర్ధరణ కాలేదన్నారు.
వివేకా ఇంట్లో వైఫై రూటర్లకు కనెక్టైన వారి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. వైఫై రూటర్ల వివరాల కోసం అమెరికా అధికారులను కోరినట్లు వెల్లడించారు. వివేకా లేఖపై నిన్ హైడ్రిన్ పరీక్ష నివేదిక రావాల్సి ఉందన్నారు. పలు సెల్ఫోన్ల ఫోరెన్సిక్ నివేదికలు త్రివేండ్రం సీ డాక్ నుంచి రావాల్సి ఉందన్నారు. జూన్ 30న సీబీఐ సమర్పించిన ఛార్జిషీట్ను ఇటీవల కోర్టు విచారణకు స్వీకరించింది.