CM Jagan : తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం ముట్టడికి గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. వాల్మీకి, బోయ, బెంతు ఒరియా కులాలను ఎస్టీల్లో చేరిస్తే తమ రిజర్వేషన్లు తగ్గిపోతాయని గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో అప్రమత్తమైన పోలీసు అధికారులు.. భారీగా బలగాలను సీఎం నివాసం చుట్టూ మోహరించారు.
జగన్ నివాసానికి వెళ్లే మార్గాల్లో భారీగా పోలీసులను మోహరించారు. తాడేపల్లి పశు వైద్యశాల, ఎన్టీఆర్ కట్ట, పాత టోల్గేట్ కూడలి, పాతూరు అడ్డరోడ్డు, క్రిస్టియన్ పేట కూడళ్లలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. దీంతో పాఠశాలలకు వెళ్లే సమయంలో విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు కాసేపు ఇబ్బందులకు గురయ్యారు.