Bus Accident : జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి 10 బెటాలియన్ సమీపంలో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది . బోల్తా పడిన వేంటనే బస్సులో మంటలు చెలరేగాయి. ఘటనలో ఓ మహిళ ప్రయాణికురాలు బస్సులోనే సజీవదహనం అయింది. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Bus Accident : జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి 10 బెటాలియన్ సమీపంలో శుక్రవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ఓ ప్రవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది . బోల్తా పడిన వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. ఘటనలో ఓ మహిళ ప్రయాణికురాలు బస్సులోనే సజీవదహనం అయింది. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని కర్నూలు ప్రభుత్వా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుచ్చారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందా? లేదంటే షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు . ప్రమాదంలో బస్సు పూర్తిగా మంటల్లో దగ్ధం అయింది. ప్రమాదానికి గురైన బస్సు జగన్ ట్రావెల్స్ వోల్వో బస్సుగా పోలీసులు గుర్తించారు.