Bride Died Within Hours of Marriage In Manyam District: పారాణింకా ఆరకముందే.. తోరణాల కళ వాడకముందే.. పెళ్లి పందిరి తీయకముందే.. అప్పగింతలు అవ్వకముందే.. కలకల లాడే ఓ నవవధువా.. పెళ్ళి కూతురుగా ముస్తాబయ్యి.. శ్మశానానికే కాపురమెళ్ళావా అనే విషాద గేయం అందరికీ తెలిసిందే. ఇలాంటి ఘటనే మన్యం జిల్లాలో చోటు చేసుకుంది.
పెళ్లి సంబరాలు ముగియకముందే.. దీవించిన బంధువులు వెనుదిరగకముందే.. పెళ్లింట చావుగంట మోగింది. పెళ్లైన కొద్ది గంటలలోనే నవ వధువు మృతి చెందిన ఘటన దబ్బగెడ్డ గ్రామంలో చోటు చేసుకుంది. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలంలో వివాహం జరిగిన కొన్ని గంటల వ్యధిలో వధువు అఖిల మృతి చెందడంతో దబ్బగెడ్డ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
పార్వతీపురంకు చెందిన వెత్స అఖిలకు దబ్బగెడ్డ గ్రామంకు చెందిన భాస్కరరావుకు గత రాత్రి వివాహం జరిగింది. వివాహ అనంతరం నిద్రించిన వధువు అపస్మారక స్థితిలో ఉండడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన వైద్యులు ఆమె పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన వైద్యం కోసం సాలూరు ఏరియా ఆసుపత్రికి తరలించమని సూచించారు.
Also Read: అమ్మాయి కన్నీటి లేఖ.. హత్య ? ఆత్మహత్య?
సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఆమెను తరలించగా.. వైద్యులు పరీక్షించి మార్గమధ్యలోనే చనిపోయినట్లు నిర్ధారించారు. మరణానికి గల కారణలను పోస్టుమార్టం నివేదికలో తెలియజేస్తామన్నారు. ఇంట్లో శుభకార్యం జరిగిన కొన్ని గంటల్లోనే ఇలా జరగడంతో కుటుబసభ్యులలో విషాదం అలుముకుంది.