EPAPER

Bomb Threat: తిరుపతిలో హోటళ్లకు బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన పోలీసులు

Bomb Threat: తిరుపతిలో హోటళ్లకు బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన పోలీసులు

Bomb Threat : ఈ మధ్యకాలంలో విమానాశ్రయాలకు, పలు నగరాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం మనం చూస్తేనే ఉన్నాము. తాజాగా తిరుపతిలో పలు హోటల్స్ బాంబులతో పేల్చేస్తామని ఉగ్రవాదులు ఈమెయిల్స్ పంపడం, బెదిరింపు కాల్స్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. నగరంలో నాలుగు హోటల్స్‌కు  బెదిరింపు ఈమెయిల్స్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. తిరుపతిలోని హోటల్స్‌లో బాంబు పెట్టామంటూ ఫోన్ కాల్‌ రావటంతో అధికారులు ముమ్మర సోదాలు చేశారు. నగరంలో ఉన్న హోటళ్లలో.. బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము వరకూ తనిఖీలు నిర్వహించారు. ఎక్కడా బాంబు లేకపోవటంతో.. ఊపిరి పీల్చుకున్నారు. ఫేక్ కాల్ ఎవరు చేశారనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఇదిలా ఉంటే.. మరోవైపు ఇండియన్ ఎయిర్ లైన్స్‌కు బాంబు బెదిరింపులు కంటిన్యూ అవుతున్నాయి. బెదిరింపులు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఓవైపు కేంద్రం హెచ్చరికలు చేస్తున్నప్పటికీ.. కాల్స్ ఆగడం లేదు. నిన్న ఒక్కరోజే 90కి పైగా విమానాలకు ఈ ఫేక్‌ బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తుంది. వాటిలో ఎయిరిండియా, విస్తారా, ఇండిగో, ఆకాశ ఎయిర్‌లైన్స్ ఉన్నాయి. మొత్తంగా 11 రోజుల వ్యవధిలో 250 ఫ్లైట్లకు బెదిరింపులు వచ్చాయి.

ఢిల్లీ పోలీసులు ఇప్పటికే ఈ బాంబు బెదిరింపులు వ్యవహారానికి సంబంధించి 8 కేసులు నమోదు చేశారు. ఈ బెదిరింపులు ఎక్కువగా ఒకే ట్విట్టర్ అకౌంట్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్, మెటాతో సహా పలు సామాజిక మాధ్యమాల ప్రతినిధులతో వర్చువల్‌గా కేంద్ర ప్రభుత్వ అధికారుల భేటీ అయ్యారు. ట్విట్టర్ తీరు నేరాలను ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందంటూ వారు మండిపడ్డారు. ఇటువంటి బెదిరింపులను వ్యాప్తి చేస్తుంటే వాటి కట్టడికి ఎలాంటి చర్యలు చేపట్టారో తెలియజేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.


Also Read: మాజీ సీఎం వైఎస్ జగన్ కు విషెస్ చెప్పిన టీడీపీ.. అయితే కాస్త వెరైటీగా..!

వరుస ఘటనలపై పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ.. విమానయాన భద్రతే ప్రభుత్యానికి అత్యున్నత ప్రాధాన్యమన్నారు. బెదిరింపులకు పాల్పడేవారిని నోఫ్లై జాబితాలో చేర్చేలా చట్టాలను సవరిస్తున్నామన్నారు. బెదిరింపు కాల్స్, సోషల్‌ మీడియా పోస్టులకు పాల్పడేవారికి జీవిత ఖైదు విధించేలా చట్టపరమైన మార్పులు తీసుకొస్తున్నామన్నారు. విమానం బోర్డింగ్ అయ్యాక బెదిరింపులు చేసేవారికి ఇలాంటి శిక్షవిధించేలా ఇప్పటికే చట్టంలో కొన్ని సెక్షన్లు ఉన్నాయి. అయితే వేరే ప్రాంతాల్లో ఉంటూ.. బాంబు బెదిరింపులకు పాల్పడే వారికి కూడా ఈ సెక్షన్లు వర్తింపజేసేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.

Related News

YS Sharmila vs YS Jagan: వైఎస్ఆర్‌కు, నీకు సంబంధం లేదు: షర్మిల

TDP vs YCP: మాజీ సీఎం వైఎస్ జగన్ కు విషెస్ చెప్పిన టీడీపీ.. అయితే కాస్త వెరైటీగా.. రిప్లై కూడా అదిరింది!

Tirumala Darshan Update Today: తిరుమలలో ఈ ఒక్క తప్పు చేయవద్దు సుమా.. ప్రస్తుతం దర్శనానికి ఎన్ని గంటల సమయమంటే?

Diarrhoea Cases Palnadu: డయేరియా మరణాలపై ప్రభుత్వం సీరియస్.. రంగంలోకి దిగిన మంత్రులు.. వైద్యశాఖ అప్రమత్తం

Jagan vs Sharmila: తారాస్థాయికి అన్నా, చెల్లి ఆస్తి వివాదం.. కాంగ్రెస్‌లో వైసీపీ విలీనం

Chandrababu on Jagan: ఛీ.. ఛీ ఇలాంటి వారు రాజకీయాల్లోనా.. తల్లి, చెల్లిపై కేసులా.. ఒక్క నిమిషం చాలు నాకు.. జగన్ పై మండిపడ్డ సీఎం చంద్రబాబు

Big Stories

×