Chandrababu Meeting: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లా పర్యటన వేళ బాంబు కలకలం రేగింది. నేడు చింతలపూడిలో ‘రా.. కదలిరా’ బహిరంగ సభ జరగనుంది. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణం వద్ద బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది.
హెలీప్యాడ్ కేటాయించిన స్థలంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తుండగా సిగ్నల్ బజర్ మోగింది. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడ తవ్వకాలు చేపట్టారు.
అనకాపల్లి జిల్లా మాడుగుల సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. అక్కడ నుంచి చింతలపూడికి రావాల్సి ఉంది.