EPAPER

Road Accident: కొత్తసంవత్సరంలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి

Road Accident: కొత్తసంవత్సరంలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి

Road Accident: కొత్తసంవత్సరం అంతా బాగుండాలని, ఎలాంటి విషాదాలు వద్దని ఎంత కోరుకున్నా.. కొన్ని సంఘటనలు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తాయి. ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించడంతో.. మూడు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎదురుగా వస్తున్న బైక్ ను బొలెరో వాహనం ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.


ఎస్సై నరసింహారావు తెలిపిన వివరాల ప్రకారం.. బెస్తవారపేట మండలం శెట్టిచెర్ల అడ్డరోడ్డు వద్ద ప్రమాదం జరిగింది. పాపాయిపల్లికి చెందిన పవన్ (20), శ్రీనివాస్ (21), రాహుల్ (21) టీ తాగేందుకు పందిళ్లపల్లి సమీపంలోని టోల్ ప్లాజా వద్దకు బైక్ పై వెళ్తున్నారు. వారికి ఎదురుగా గిద్దలూరు నుంచి వస్తున్న బొలెరో వాహనం బైక్ ను ఢీ కొట్టింది. ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×