Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్ఎంఎస్-2 లిక్విడ్ స్టీల్ విభాగంలో లాడిల్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్త స్టీల్ ప్లాంట్లోని జనరల్ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నగరంలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదంలో గాయపడిన వారిలో ఐదుగురు కాంట్రాక్టు ఉద్యోగులు, నలుగురు పర్మినెంట్ ఉద్యోగులు ఉన్నారు. గాయపడిన వారిని బంగారయ్య, అనిల్, శ్రీను, పోతయ్య, జైకుమార్, సూరిబాబు, ఈశ్వర్, సాహు, అప్పలరాజుగా గుర్తించారు. ఇక ప్రమాదంలో ప్లాంట్ ఎస్ఎంఎస్-2 వద్ద స్టాగ్ యార్డ్ కన్వేయర్ బెల్టు దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు.