EPAPER
Kirrak Couples Episode 1

Vidadala Rajini : మంత్రి విడదల రజనికి షాక్.. ప్రసంగాన్ని అడ్డుకున్న బీజేపీ నేతలు..

Vidadala Rajini : మంత్రి విడదల రజనికి షాక్.. ప్రసంగాన్ని అడ్డుకున్న బీజేపీ నేతలు..

Vidadala Rajini : ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనికి షాక్‌ తగిలింది. గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని కూడా హాజరయ్యారు. అయితే వేదికపై ఆమె ప్రసంగిస్తున్న సమయంలో బీజేపీ నేతలు అడ్డుతగిలారు.


కేంద్రం నిధులతో కార్యక్రమాలు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం పేరు చెప్పుకుంటున్నారేంటంటూ ప్రశ్నించారు. ప్రధాని మోదీ పేరు చెప్పకపోవడంతో బీజేపీ నేతలు ఆగ్రహించారు. ఆమె ప్రసంగాన్ని అడ్డుకున్నారు. బీజేపీ నేతల రియాక్షన్‌తో షాకైన మంత్రి రజని.. తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. తిరిగి వేదికపై తన సీటులో కూర్చున్నారు. ఈ సమయంలో బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. తమ ఆవేదనను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో బీజేపీ నేతలను కేంద్రమంత్రి మన్సుఖ్‌ మాండవీయ వారించారు.

అదేసమయంలో ఏపీ ఆరోగ్య శాఖ కార్యదర్శి కృష్ణబాబు కల్పించుకున్నారు. ఈ అభ్యంతరాలను కేంద్రమంత్రికి చెప్పానంటూ బీజేపీ నేతలకు సర్దిచెప్పారు. దీంతో వివాదం సద్దుమణిగింది.


Related News

MP Vijayasai Reddy: విజయ సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత.. చంద్రబాబుపై మండిపాటు

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Tirupati laddu: తిరుపతి లడ్డూ వివాదం.. అముల్ కంపెనీ ఏం చెప్పిందంటే..

MLC Botsa Comments: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. దేవుడితో రాజకీయాలొద్దన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స

Jagan clarification: ఒప్పేసుకున్న జగన్.. మళ్లీ బెంగుళూరుకి, పోతే పోనీ అంటూ

MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసు కొత్త మలుపు.. అసలేం జరుగుతోంది?

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

Big Stories

×