Big TV Survey on Pileru Assembly Constituency: ఏపీలోని కీలక నియోజకవర్గాల్లో పీలేరు ఒకటి. ఈ సెగ్మెంట్ అటు తిరుపతి, మదనపల్లి, చిత్తూరు, రాయచోటి, పలమనేరు వంటి ప్రాంతాలకు మధ్యలో అన్నిటికీ 57 కిలోమీటర్ల డిస్టెన్స్ లో సెంటర్ లో ఉంటుంది. రాజకీయంగా, వాణిజ్యపరంగా కీలక ప్రాంతమిది. 1994కు ముందు ఇక్కడ టీడీపీ హవా నడిచింది. కానీ ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క ఎలక్షన్ లోనూ పీలేరులో తెలుగుదేశం పార్టీ గెలవలేకపోయింది. అప్పటి నుంచి పోరాడుతూ ఓడుతూనే వస్తోంది. మరి ఇప్పుడు పీలేరులో రాజకీయ సమీకరణాలు మారాయా? పీలేరు నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.
2019 RESULTS
చింతల రామచంద్రారెడ్డి (వైసీపీ విజయం) VS నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి
2019 ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గంలో వైసీపీ గెలిచింది. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన చింతల రామచంద్రారెడ్డి 49 శాతం ఓట్లు సాధించారు. అటు టీడీపీ నుంచి పోటీ చేసిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి 45 శాతం ఓట్లు వచ్చాయి. ఇక ఇతరులు 6 శాతం ఓట్లు సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి గెలుపునకు కారణం ఆయన వ్యక్తిగత ఇమేజ్. అలాగే జగన్ వేవ్ తోడవడం మరో రీజన్. అలాగే 2017లో టీడీపీలో చేరిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ టిక్కెట్ పై పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు. కేవలం 4.4 శాతం ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. మరోసారి ఈ ఇద్దరి మధ్యే పోటీకి పీలేరు సిద్ధమైంది. మరి ఈసారి ఎన్నికల్లో పీలేరు సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.
Read More: Ramachandrapuram Assembly Constituency: రామచంద్రాపురం రాజెవరు? బిగ్ టీవీ సర్వే ఏం చెబుతుంది..?
చింతల రామచంద్రారెడ్డి (YCP) ప్లస్ పాయింట్స్
చింతల రామచంద్రారెడ్డి మైనస్ పాయింట్స్
నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి (TDP) ప్లస్ పాయింట్స్
ఇక వచ్చే ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..
చింతల రామచంద్రారెడ్డి VS నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పీలేరులో వైసీపీ, టీడీపీ మధ్య ఉత్కంఠ పోరు ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇందులో టీడీపీకి కొంచెం గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. టీడీపీ అభ్యర్థిగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి బరిలో దిగితే ఆయనకు 49 శాతం ఓట్లు, ఇక వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి 47 శాతం ఓట్లు, ఇతరులకు 4 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. టీడీపీ, వైసీపీ మధ్య కేవలం 2 శాతం ఓట్ షేర్ మాత్రమే తేడా తేడా ఉంది. తటస్థ ఓటర్ల తీర్పు కీలకం కాబోతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. టీడీపీ అభ్యర్థి కిషోర్ కుమార్ రెడ్డి గతంలో రెండుసార్లు ఓడిన సానుభూతి, జనసేనతో పొత్తు కూడా టీడీపీ అభ్యర్థికి కీ రోల్ పోషించబోతున్నట్లు తెలిసింది. పీలేరు సెగ్మెంట్ లో కాపు సామాజికవర్గం జనాభా 18 శాతంగా ఉంది. వీరిలో మెజార్టీ ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీవైపు పడుతాయన్న అంచనాలున్నాయి. అటు వైసీపీ ఓట్ షేర్ కు కారణం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, వైఎస్ జగన్ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్దిదారుల ఓట్లు కీలకం కాబోతున్నాయి. అలాగే మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి ఈ సెగ్మెంట్ ప్రజలతో మంచి సత్సంబంధాలున్నాయి. వారి ఇమేజ్ కూడా వైసీపీ ఓట్లు పెరగడానికి కారణంగా కనిపిస్తున్నాయి.