EPAPER

Chodavaram Assembly Constituency: చోడవరంలో ఎవరికి ఎర్త్? ఎవరికి బెర్త్? బిగ్ టీవీ సర్వే ఏం చెబుతుంది?

Chodavaram Assembly Constituency: చోడవరంలో ఎవరికి ఎర్త్? ఎవరికి బెర్త్? బిగ్ టీవీ సర్వే ఏం చెబుతుంది?
AP political news

Chodavaram Assembly Constituency: చోడవరం.. కాపు సామాజికవర్గం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఇది ఒకటి. అంతేకాదు షుగర్ టౌన్‌గా పేరుగాంచిన ఈ నియోజకవర్గం 2019 వరకు టీడీపీ కంచుకోటగా ఉంది. కానీ 2019 ఎన్నికల్లో కరణం ధర్మశ్రీ సంచలన విజయం సాధించారు. ఆయనకు ప్రభుత్వ విప్‌తో పాటు జిల్లా వైసీపీ అధ్యక్షునిగా బాధ్యతలు అప్పజెప్పారు. దాంతో కాపు సామాజికవర్గానికి వీలైనంత ప్రాధాన్యత ఇస్తున్నామనే సంకేతాలు పంపింది వైసీపీ అధిష్టానం. గత మూడు ఎన్నికల్లో పోటీ కరణం ధర్మశ్రీ, టీడీపీ అభ్యర్థి KSN రాజు మధ్యే జరుగుతోంది. అయితే ఈసారి కూడా వీరిద్దరి మధ్యే పోటీ జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే టీడీపీ నుంచి తాతయ్య బాబు కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇక్కడి వరకు లెక్కలు బాగానే ఉన్నా.. జనసేన మాత్రం ఇక్కడ బరిలోకి దిగితే మొత్తం క్యాలుక్యులేషన్స్‌ మారే అవకాశం కనిపిస్తోంది. నియోజకవర్గం మొత్తం ప్రభావం చూపే అవకాశం ఉండటంతో కాపు సామాజికవర్గం నేతకే టికెట్ ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. మరి ఈసారి ఇక్కడ ఎవరు బరిలో నిలిస్తే ఏ పార్టీ గెలుస్తోంది? ఏ నేత సత్తా ఎంత? అన్న దానిపై బిగ్ టీవీ ఎక్స్‌క్లూజివ్ సర్వే నిర్వహించింది. ఆ రిపోర్ట్‌ను చూసేముందు ముందుగా 2019 ఎన్నికల ఫలితాలను పరిశీలిద్ధాం.


2019 RESULTS

కరణం ధర్మశ్రీ(గెలుపు) vs కలిదిండి సూర్య నాగ సన్యాసి రాజు


గత ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గంలో బంపర్ విక్టరీ సాధించారు వైసీపీ అభ్యర్థి కరణం ధర్మశ్రీ. ఆయన ఏకంగా 54 శాతం ఓట్లు సాధించుకున్నారు. జగన్‌ మ్యానియా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి. అంతేకాదు ఆయన కాపు సామాజిక వర్గ నేత కావడం కూడా ఆయనకు కలిసొచ్చింది. మరోవైపు టీడీపీ అభ్యర్థి సూర్యనాగ సన్యాసి రాజుకు కేవలం 38 శాతం ఓట్లు వచ్చాయి. అంతకుముందు ఎన్నికలతో పోల్చితే ఆయన ఓటు షేర్ తగ్గిపోయింది. ఆయన రాజకీయంగా యాక్టివ్‌గా లేకపోవడం ఆయనకు నష్టం చేకూర్చింది. ఇక జనసేన తరపున బరిలోకి దిగిన PVSN రాజుకు 3 శాతం ఓట్లు వచ్చాయి. ఇక ఇతరులకు 5 శాతం ఓట్లు పోలయ్యాయి.

ఇది గత ఎన్నికల రిపోర్ట్. ఇక ఈ సారి ఎవరెవరు బరిలో ఉంటున్నారో వారి వివరాలు చూద్దాం. ముందుగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కరణం ధర్మశ్రీ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏంటో పరిశీలిద్దాం.

కరణం ధర్మశ్రీ (YCP) ప్లస్ పాయింట్స్

  • మొదటి నుంచి చోడవరం నుంచే బరిలోకి దిగుతుండటం
  • అభివృద్ధి పనులకు చేసిన శంకుస్థాపనలు
  • కలిసి రానున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు

కరణం ధర్మశ్రీ మైనస్ పాయింట్స్

  • ఆయనపై ఉన్న నెగటివ్ పబ్లిసిటీ
  • ప్రజలకు అందుబాటులో ఉండరన్న పేరు
  • ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం
  • ఎమ్మెల్యే సోదరులు కమీషన్లు తీసుకుంటున్నారన్న ఆరోపణలు
  • క్యాడర్ పూర్తిస్థాయిలో సహకరించకపోవడం
  • నియోజకవర్గంలో ఆశించినంత అభివృద్ధి జరగకపోవడం

ఇవి ప్రస్తుత ఎమ్మెల్యే ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్. ఇప్పుడు టీడీపీ నేత KSN రాజు ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏంటో చూద్ధాం.

Read More: Eluru Assembly Constituency: బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. ఏలూరును ఏలబోయేది ఎవరు?

కలిదిండి సూర్య నాగ సన్యాసి రాజు (TDP) ప్లస్ పాయింట్స్

  • చోడవరం నుంచి వరుసగా పోటీ చేస్తూ రావడం
  • నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడన్న పేరు
  • గత ఎన్నికల్లో ఓడిపోయారన్న సింపతి
  • తన హయాంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి
  • కలిసి రానున్న టీడీపీ-జనసేన పొత్తు

కలిదిండి సూర్య నాగ సన్యాసి రాజు మైనస్‌ పాయింట్స్

  • ఓటమి తర్వాత న్యూట్రల్‌గా ఉన్నారన్న పేరు
  • భక్తుల తాతయ్య బాబు టికెట్ ఆశిస్తూ ఉండటం

భక్తుల తాతయ్య బాబు (TDP) ప్లస్ పాయింట్స్

  • ప్రస్తుతం నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఉండటం
  • KSN రాజు మద్ధతు ఉండటం
  • కలిసి రానున్న టీడీపీ-జనసేన మద్ధతు

భక్తుల తాతయ్య బాబు మైనస్‌ పాయింట్స్

  • రాజకీయ అనుభవం లేకపోవడం
  • ప్రజల్లో అంతగా గుర్తింపు లేకపోవడం
  • టికెట్ వస్తే గట్టి పోటీ ఇవ్వలేరన్న ప్రచారం

పంచకర్ల రమేష్‌ బాబు (JSP) ప్లస్ పాయింట్స్

  • కలిసి రానున్న కాపు సామాజిక ఓటర్ల మద్ధతు
  • టికెట్ ఇస్తానన్న పవన్ కల్యాణ్‌ హామీ
  • టికెట్ దక్కితే గెలుస్తారన్న ప్రచారం

పంచకర్ల రమేష్‌ బాబు మైనస్ పాయింట్స్

  • నియోజకవర్గంలో గట్టిగా ప్రచారం చేసుకోకపోవడం

ఇక వచ్చే ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం..

కరణం ధర్మశ్రీ vs కలిదిండి సూర్య నాగ సన్యాసి రాజు

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగి కరణం ధర్మశ్రీ, కలిదిండి సూర్యనాగ సన్యాసి రాజు బరిలోకి దిగితే గెలుపు అవకాశాలు టీడీపీకే ఎక్కువగా ఉన్నాయని బిగ్ టీవీ సర్వేలో తేలింది. టీడీపీ అభ్యర్థి KSN రాజుకు 49 శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉంది. దీనికి ఆయన పర్సనల్ ఇమేజీతో పాటు.. ఆయన హయాంలో మాత్రమే నియోజకవర్గం అభివృధ్ధి చెందిందన్న భావనలో ప్రజలు ఉండటం ఆయనకు బాగా కలిసి వస్తోంది. దీనికి తోడు నియోజకవర్గంలో మెజారీటీ స్థానంలో ఉన్న కాపు సామాజిక వర్గ ఓటర్లు పొత్తులో భాగంగా టీడీపీకే మద్ధతు పలికే అవకాశం కనిపిస్తోంది. ఇవీ కాకుండా ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఆయనకు బాగానే కలిసి రానుంది. ఇక పార్టీ టికెట్‌ KSN రాజుకే కేటాయిస్తే టికెట్ ఆశిస్తున్న తాతయ్య బాబు కూడా సహకరించే అవకాశం ఉంది. అందుకే ఆయనకు 49 శాతం ఓట్లు పడే అవకాశం ఉందని సర్వే రిపోర్ట్ చెబుతోంది.

ఇక ప్రస్తుత ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి గత ఎన్నికలతో పోల్చితే భారీగా ఓట్‌ షేర్‌ పడిపోతుందని సర్వే రిపోర్ట్ చెబుతోంది. ఆయనకు 43 శాతం ఓట్లు పడే అవకాశం ఉంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఆయనకు బలంగా సపోర్ట్ చేసే అవకాశముందని తేలింది.

ఇక మరో సినారియాలో పొత్తులో భాగంగా టీడీపీకి కాకుండా టికెట్ జనసేనకు దక్కి పంచకర్ల రమేష్‌ బాబు బరిలోకి దిగితే పరిస్థితి ఎలా ఉంటుందో పరిశీలిద్ధాం.

కరణం ధర్మశ్రీ vs పంచకర్ల రమేష్‌ బాబు

ఈ సినారియలో జనసేన గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్టు సర్వే రిపోర్ట్ చెబుతోంది. జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్‌ బాబుకు ఏకంగా 54 శాతం ఓట్లు పడే అవకాశం ఉందని సర్వే రిపోర్ట్ చెబుతోంది. నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న కాపు సామాజిక ఓటర్లు ఆయనకు బలమైన మద్ధతు కానున్నారు. అంతేకాదు టీడీపీ నేతల నుంచి కూడా పూర్తి సహాకారం అందుతుందని తెలుస్తోంది. ఇక ఈ సీనారియాలో ప్రస్తుత ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి మరింత ఓట్‌ షేర్‌ తగ్గి కేవలం 40 శాతానికే పరిమితమయ్యే అవకాశం ఉందని బిగ్ టీవీ ఎలక్షన్‌ సర్వే రిపోర్ట్ చెబుతోంది.

Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×