Atmakur Assembly Constituency Survey: ఏపీలోని కీలక నియోజకవర్గాల్లో ఆత్మకూరు ఒకటి. సోమశిల డ్యాం ఈ సెగ్మెంట్ పరిధిలోనే ఉంటుంది. ఇక్కడి రాజకీయాల్లో మేకపాటి కుటుంబానికి చాలా ప్రాధాన్యం ఉంది. సెగ్మెంట్లో ఈ కుటుంబానికి మంచి పేరు ఉంది. 2019 ఎన్నికల్లో గెలిచిన మేకపాటి గౌతమ్ రెడ్డి.. వైఎస్ జగన్ హయాంలో మంత్రిగా పని చేశారు. అయితే 2022లో గుండెపోటుతో చనిపోయారు. ఆ తర్వాత వచ్చిన బైపోల్లో ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిచి ఆత్మకూరులో పట్టు నిలుపుకున్నారు. మరి ఇప్పుడు ఆత్మకూరు నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.
2019 RESULTS
మేకపాటి గౌతమ్ రెడ్డి VS బొల్లినేని కృష్ణయ్య
2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి 53 శాతం ఓట్లతో ఘన విజయం సాధించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన బొల్లినేని కృష్ణయ్యకు 40 శాతం ఓట్లు వచ్చాయి. ఇతరులకు 7 శాతం ఓట్లు దక్కాయి. గత ఎన్నికల్లో విపక్ష సభ్యుడిగా ఉండిపోవడం వల్ల ఆత్మకూరు అభివృద్ధి చేయలేకపోయానని 2019లో గౌతమ్ రెడ్డి ప్రచారం చేయడం, ఆ సింపథీ కలిసి వచ్చి గెలిచారు. అయితే ఆయన హఠాన్మరణంతో 2022లో ఆత్మకూరులో ఉప ఎన్నిక జరిగింది. అప్పుడు గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీ చేయడం భారీ మెజార్టీతో గెలవడం జరిగిపోయాయి. మరి ఈసారి ఎన్నికల్లో ఆత్మకూరు సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.
Read More: Mandapeta Assembly constituency: బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. మండపేటలో టీడీపీ హవా కొనసాగేనా?
మేకపాటి విక్రమ్ రెడ్డి ( YCP ) ప్లస్ పాయింట్స్
మేకపాటి విక్రమ్ రెడ్డి మైనస్ పాయింట్స్
కొమ్మి లక్ష్మయ్య నాయుడు ( TDP ) ప్లస్ పాయింట్స్
కొమ్మి లక్ష్మయ్య నాయుడు మైనస్ పాయింట్స్
గూటూరు మురళీ కన్నబాబు ( TDP ) మైనస్ పాయింట్స్
బొల్లినేని కృష్ణయ్య ( TDP ) ప్లస్ పాయింట్స్
బొల్లినేని కృష్ణయ్య మైనస్ పాయింట్స్
ఆనం కైవల్య రెడ్డి ( TDP ) ప్లస్ పాయింట్స్
ఆనం కైవల్య రెడ్డి మైనస్ పాయింట్స్
నల్లిశెట్టి శ్రీధర్ ( JSP ) ప్లస్ పాయింట్స్
ఇక వచ్చే ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం…
మేకపాటి విక్రమ్ రెడ్డి VS బొల్లినేని కృష్ణయ్య
ఇప్పటికిప్పుడు ఆత్మకూరులో ఎన్నికలు జరిగితే వైసీపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో వెల్లడైంది. వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగే మేకపాటి విక్రమ్ రెడ్డికి 51 శాతం ఓట్లు, టీడీపీ అభ్యర్థిగా బొల్లినేని కృష్ణయ్య బరిలో దిగితే 43 శాతం ఓట్లు, ఇతరులకు 6 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక వైసీపీకి ఎక్కువ ఓట్ షేర్ రావడానికి కారణం… ఆత్మకూరు సెగ్మెంట్ లో మేకపాటి కుటుంబానికి ఉన్న ఇన్ ఫ్లూయెన్స్. అదే సమయంలో మంత్రిగా పని చేస్తూ గుండెపోటుతో మేకపాటి గౌతమ్ రెడ్డి చనిపోవడం కూడా ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల్లో సింపథీని బాగా పెంచేశాయి. మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా సీనియర్ పార్లమెంటేరియన్ గా ఉండడం, జనంలో ఇన్ ఫ్లూయెన్స్ పెరిగేలా చేశాయి. అదే సమయంలో వైసీపీ కన్సాలిడేటెడ్ ఓటు బ్యాంకు ఉండడం, అపోజిషన్ అభ్యర్థులు బలహీనంగా కనిపించడం, బలమైన క్యాడర్ సపోర్ట్ ఉండడం, టీడీపీలో టిక్కెట్ కోసం చాలా మంది నేతల మధ్య పోటీ ఉండడం, కోల్డ్ వార్ ఇవన్నీ వైసీపీ ఓటు బ్యాంకు పెరగడానికి కారణంగా తేలింది.