Ap Big Breaking War : ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీతో మాజీ అధికార వైసీపీకి మధ్య ఏదో జరుగుతోంది. తెలుగుదేశం, వైసీపీ పార్టీలు బిగ్ బ్రేకింగులు అంటూ యుద్ధ వాతావరణాన్ని సృష్టించాయి.
సంచలన పోస్ట్…
గురువారం మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ ఎక్స్ పోజ్ – స్టే ట్యూన్డ్ అంటూ టీడీపీ సంచలన పోస్ట్ చేసింది. ఇందుకు ప్రతిస్పందించిన వైసీపీ, తామేం తక్కువకాదన్నట్టుగా అదే సమయానికి మరో బిగ్ రివీల్ అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో రాష్ట్రంలో పొలిటికల్ వార్ జరగనున్నట్లు ప్రజలు భావిస్తున్నారు.
బిగ్ రివీల్ లో ఏముంది ?
పత్రికా సంస్థలు, న్యూస్ ఛానెళ్ల రేంజ్ లో బ్రేకింగ్ న్యూస్ అంటూ ఈ రెండు పార్టీలు సంచలనానికి తెరలేపాయి. దీంతో ఆయా పార్టీల శ్రేణులు, క్యాడర్ సైతం బెంబెలెత్తిపోతున్నారు. పార్టీల మధ్య ఏం జరుగుతోంది, బిగ్ రివీల్ తర్వాత వచ్చే పరిణామాలను ఎలా ఎదుర్కోవాలి అంటూ ఆందోళన పడుతున్నారట.
ఇక బిక్ బ్రేకింగ్ వార్తలపై అటు టీడీపీ ఇటు వైసీపీ పార్టీల్లో ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయని టాక్. ఏపీలో ఉత్కంఠకు దారితీస్తున్న నేపథ్యంలో ఈ రెండు పార్టీలు ఏం బాంబులు పేల్చనున్నాయన్న గుబులు మాత్రం ఓ రేంజ్ లో ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
టీడీపీ, వైసీపీ మధ్య బిగ్ బ్రేకింగుల యుద్ధం
రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు బిగ్ ఎక్స్ పోజ్ -స్టే ట్యూన్డ్ అంటూ టీడీపీ పోస్ట్
కౌంటర్ గా అదే టైమ్ కి బిగ్ రివీల్ అంటూ తర్వాత పోస్ట్ పెట్టిన వైసీపీ pic.twitter.com/cVrQbYyFoZ
— ChotaNews (@ChotaNewsTelugu) October 23, 2024
also read : కేటీఆర్.. తాటాకు చప్పుళ్లకు భయపడేదు-బండి సంజయ్