TTD Chairman : టీటీడీ ఛైర్మన్ పదవి ఊహించిన విధంగానే భూమన కరుణాకర్ రెడ్డికి దక్కింది. ఆయనను టీటీడీ ఛైర్మన్ ప్రభుత్వం నియమించింది. భూమన గతంలోనూ టీటీడీ ఛైర్మన్ గా పనిచేశారు. వైఎస్ హయాంలో 2006 నుంచి 2008 వరకు ఆ హోదాలో కొనసాగారు.
భూమన కరుణాకర్ రెడ్డి ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ హోదాలో టీటీడీ బోర్డులో ఎక్స్ ఆఫిషియో సభ్యుడిగానూ ఉన్నారు. సీఎంగా వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తర్వాత వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ ఛైర్మన్ పదవి అప్పగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనే ఆ పదవిలో కొనసాగారు.
వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం పూర్తైన తర్వాత రెండోసారి అవే బాధ్యతలు అప్పగించారు. తాజాగా ఆయన స్థానంలో టీటీడీ ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమించారు. ఆయన రెండేళ్లపాటు టీటీడీ ఛైర్మన్గా వ్యవహరిస్తారు. టీటీడీ ఛైర్మన్గా నియమించిన సీఎం జగన్ కు భూమన ధన్యవాదాలు తెలిపారు.