Yamini Krishnamurthy passes away: ప్రముఖ భరతనాట్య, కూచిపూడి నరక్తిగా పేరుగాంచిన యామినీ కృష్ణమూర్తి కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో గత కొద్దిరోజులుగా బాధపడుతున్న ఆమె.. డిల్లీలో ఉన్న ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. యామినీ కృష్ణమూర్తి.. ఏపీలోని మదనపల్లెలో 1940లో జన్మించారు. 1968లో పద్మశ్రీ అవార్డు, 2001లో పద్మభూషణ్, 2016లో పద్మ విభూషణ్ అవార్డులతో కేంద్రప్రభుత్వం యామినీని ఘనంగా సత్కరించింది. గతంలో టీటీడీ ఆస్థాన నర్తకిగా కూడా యామినీ సేవలందించారు.
Also Read: నంద్యాలలోని ఓ స్కూల్లో పుడ్ పాయిజన్.. 100 మంది విద్యార్థులకు అస్వస్థత
అదేవిధంగా ఢిల్లీలో ‘యామినీ స్కూల్ ఆఫ్ డ్యాన్స్’ ను స్థాపించి ఎంతోమంది యువతకు భరత నాట్యం, కూచిపూడి నృత్యంలో శిక్షణ కూడా ఇచ్చారు. ఏ ప్యాషన్ ఫర్ డ్యాన్స్ అనే పుస్తకాన్ని కూడా యామినీ రచించారు.