Ayyanna patrudu latest comments(Political news in AP): జగన్ పార్టీ నేతలపై అధికార టీడీపీ ప్రతీకారం తీసుకుంటుందా? ముమ్మాటికీ తప్పదంటున్నారు ఆ పార్టీ నేతలు. ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు. వాళ్లని ఏమాత్రం వదిలే ఛాన్స్ లేదంటున్నారు. ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన తర్వాత మీడియాతో మాట్లాడారు.
వైసీపీ నేతలపై ప్రతీకారం తీర్చుకుందామని, కానీ చట్టం ప్రకారం చేయాలన్నారు అయ్యన్న. అధినేత చంద్రబాబు ఈ విషయంలో కాస్త మెతక వైఖరి అవలంభించినా, తాను వదలనన్నారు. అందర్నీ కటకటాలకు పంపిస్తామన్నారు. రానున్న మూడురోజుల్లో మనల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ఈసీ మంచి నిర్ణయం తీసుకుందన్నారు.
గొడవలు జరిగి మనుషులు చనిపోతే దానికి ఎవరు బాధ్యులు ఎవరని ప్రశ్నించారు అయ్యన్న. విశాఖలో భూములు దోచేశారని, ఈ విషయంలో అధికారులకు సైతం వదిలేదని కుండబద్దలు కొట్టేశారు. ఆరో తేదీ వరకు ర్యాలీ, సభలు, సమావేశాలు వద్దని కార్యకర్తలకు రిక్వెస్ట్ చేశారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేవరకు సైలెంట్గా ఉండాలని కార్యకర్తలకు హితవు పలికారు.
ALSO READ: శ్రీకాకుళం జిల్లాలో తొలిసారి గెలిచిన అభ్యర్థులు.. రాజకీయ దురంధరుడి ఓటమి
జగన్ ముమ్మాటికీ సైకో అని, చివరకు ప్రజలు ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్నారు అయ్యన్న. గడిచిన ఐదేళ్లలో అన్ని వర్గాలు ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారని, చాలా మంది చనిపోయారని గుర్తు చేశారు. చేసిన తప్పులకు శిక్ష తప్పదన్నారు అయ్యన్నపాత్రుడు.
వైసీపీలో ఎవర్నీ వదిలేది లేదు.. కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాను.. చంద్రబాబు వదిలిపెట్టినా నేను మాత్రం వదలను.. నామీద అనేక తప్పుడు కేసులు పెట్టారు.. ముఖ్యంగా సైకో విజయసాయిరెడ్డిని అస్సలు వదిలేది లేదు… మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు..#YCP #andhrapradeshcm #andhrapolitics… pic.twitter.com/hEnQO2dn1X
— ChotaNews (@ChotaNewsTelugu) June 5, 2024