Tirupati : తిరుపతిలోని టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న మూగ బధిర పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. ఎనిమిదవ తరగతి చదువుతున్న చందు అనే విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేశారు. చందుపై కెమికల్ ఆయిల్ పోసి నిప్పు అంటించారు. ప్రస్తుతం చందు పరిస్థితి విషమంగా ఉండడంతో, తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చందు శరీరం 70శాతం కాలిపోయింది. నిందితులను కాపాడేందుకు హాస్టల్ వార్డెన్ సిబ్బంది ప్రయత్నిస్తునట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు న్యాయం చేయాలని బాధితుడి తల్లిదండ్రులు కోరుతున్నారు. హాస్టల్లో సీసీ ఫుటేజ్ పరిశీలించాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.