Lion attacked on Man in Tirupati:
తిరుపతిలో జూ పార్క్లో దారుణం చోటు చేసుకుంది. లయన్ ఎన్క్లోజర్లోకి వెళ్లిన ఓ వ్యక్తిపై సింహం దాడి చేసింది. ఈ దాడిలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సింహం అరుపులతో ఆ వ్యక్తి భయంతో చెట్టు ఎక్కి.. అదుపు తప్పి కిందపడిపోయాడు. అది గమనించిన సింహం అతడిపై ఒక్కసారిగా దూకి దాడి చేసింది. ఈ దాడిలో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
తిరుపతి జిల్లాలోని శ్రీ వేంకటేశ్వర జూ పార్క్ను రాజస్థాన్కు చెందిన ప్రహ్లాద్ గుర్జర్ సందర్శించడానికి వచ్చారు. సెల్ఫీ కోసం నిబంధనలు ఉల్లంఘించి లయన్ ఎన్క్లోజర్లోకి వెళ్లాడు. అందులోకి వెళ్లిన అతనిపై సింహం దాడి చేసింది. మెడ భాగంలో కొరకడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు . ప్రహ్లాద్ గుర్జార్ వృత్తిరీత్యా డ్రైవర్ అని పోలీసులు తెలిపారు. మూడు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చినట్లు వారు గుర్తించారు.
వెంటనే అప్రమత్తమైన పార్క్ సిబ్బంది సందర్శకులను బయటకు పంపంది. అంతకు ముందే జూలో ఉన్న సందర్శకులకు సైతం అనుమతి నిరాకరించారు. విషయం తెలిసిన తిరుపతి రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.