Minister Kollu Ravindra: ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కీలక విషయాలను వెల్లడించారు. కృష్ణా జిల్లాలోని గిలకలదిండిలో ఉన్న ఫిషింగ్ హార్బర్ పనులను కేంద్ర పర్యావరణ, మత్స్యశాఖ అధికారుల బృందం ఆదివారం పరిశీలించింది. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర పలు విషయాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆక్వా, మత్స్య పరిశ్రమ సమస్యల గురించి కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు. మడ అడవుల పెంపకానికి సహకరించాలంటూ వారిని కూడా ఆయన పేర్కొన్నారు.
Also Read: రైతు బాగుంటేనే.. రాష్ట్రం బాగుంటుందని గుర్తుపెట్టుకోండి బాబుగారు: జగన్
అదేవిధంగా మచిలీపట్నంలో ఆక్వా, మెరైన్ ఫిషింగ్ వర్సీని ఏర్పాటు చేయాలంటూ కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి వివరించారు. సముద్ర తీరం వెంబడి జాతీయ రహదారిని నిర్మించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరుతామంటూ మంత్రి చెప్పారు. మచిలీపట్నం – రేపల్లె మార్గాలను కలపాలంటూ రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్తామంటూ ఆయన పేర్కొన్నారు.