APPSC: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ తరుణంలో గత కొన్ని వారాలుగా వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఇప్పటికే గ్రూప్ 2, గ్రూప్ 1, పాలిటెక్నిక్, జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రకటనలు వెలువడిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా మరో భారీ నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ పోస్టులు భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 11 సబ్జెక్టుల్లో 240 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు అర్హత వయసు, జీతం పూర్తి వివరాలు https://psc.ap.gov.inలో చూడవచ్చు.
సబ్జెక్టుల వారీగా ఖాళీలు:
మొత్తం 240 ఖాళీలున్నాయి.
అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, నెట్/ స్లెట్/ సెట్ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
రాత పరీక్ష: ఏప్రిల్/ మే, 2024.
అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13 వరకు అప్లై చేసుకోవచ్చు. కాగా ఇప్పటికే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 47, పాలిటెక్నిక్ కాలేజీల్లో 99 లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే.