AP Politics : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆంధ్ర ప్రదేశ్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు(Gidugu Rudraraju) రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. ఇటీవల కాంగ్రెస్లో చేరిన వైఎస్ షర్మిల(YS Sharmila)కు పీసీసీ పదవి ఇచ్చే అవకాశముంది.
పార్టీలో చేరిన తర్వాత YS షర్మిలకు ఏ పదవి ఇస్తారన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఆ ఉత్కంఠకు నేటితో తెరపడినట్టు అయింది. ఆమెకు APCC చీఫ్ పదవి ఇస్తారని ప్రచారమైతే జరుగుతోంది. అందులోభాగంగా గిడుగు రాజీనామా చేశారని తెలుస్తోంది.
తెలంగాణ విజభన తర్వాత ఏపీలో పూర్తిగా కనుమరుగైపోయిన కాంగ్రెస్.. ఇప్పుడు కర్ణాటక, తెలంగాణలో గెలుపు ఉత్సాహంతో అక్కడ కూడా సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. ఇందుకోసం వైఎస్ షర్మిలను ఏపీ రాజకీయాల్లో ఉపయోగించుకోవాలనుకుంటున్నారు. వైఎస్పై ఉన్న సానుభూతి, అభిమానం ఏపీలో కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తాయని హై కమాండ్ ఆలోచిస్తోంది.అందుకే ఆమెకు APCC చీఫ్ పదవి ఇవ్వాలని డిసైడయింది. ఏపీలో మరికొన్ని నెలల్లోనే ఎన్నికలు ఉండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి పోటీగా షర్మిలకు కీలక బాధ్యలు అప్పగించి ఆమె సేవలను వాడుకోవాలని హస్తం పార్టీ చూస్తోంది.