AP: ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు రిలీజ్ అయ్యాయి. మొత్తం 72.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఎప్పటిలానే ఈసారి కూడా బాలికల పాస్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది. బాలురు 69.27 శాతం, బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణులయ్యారు. అంటే, బాలురు కంటే బాలికలు 6 శాతం ఎక్కువ పాస్ అయ్యారు. గతేడాది కంటే ఈసారి 5 శాతం ఉత్తీర్ణత పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో 3.47 శాతం ఉత్తీర్ణత పెరిగింది. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్లో 95.25 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. 18 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసినట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
87.4 శాతం ఉత్తీర్ణతతో ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. నంద్యాల జిల్లా చివరి స్థానంలో ఉంది.
మే 17 లోపు సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ 2 నుంచి 10 వరకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి.