EPAPER

AP Speaker Letter To Rebel MLA’s: ఇక విచారణ లేదు.. డైరక్ట్ యాక్షన్‌!

AP Speaker Letter To Rebel MLA’s: ఇక విచారణ లేదు.. డైరక్ట్ యాక్షన్‌!
AP Speaker Letter To Rebel MLAs

AP Speaker Letter To Rebel MLA’s: రెబల్ ఎమ్మెల్యేలపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్ అయ్యారు. వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేలు, టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణలో ఇప్పటికే ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. చివరగా ఈ నెల 19వ తేదీన తుది విచారణ ఉంటుందంటూ స్పీకర్‌ తమ్మినేని రెబల్ ఎమ్మెల్యేలకు సమాచారం అందించారు. అయినా కానీ ఎవరూ హాజరు కాకపోవడంపై.. స్పీకర్‌ అసహనం వ్యక్తం చేశారు .


ఈ క్రమంలోనే ఇక విచారణ చేపట్టకుండా.. న్యాయ నిపుణుల సలహాతో వారిపై చర్యలకు సిద్ధం అయ్యారని తెలుస్తోంది. రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ల అంశంలో త్వరలోనే స్పీకర్ తమ్మినేని నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో అనర్హత పిటిషన్లపై విచారణ పర్వానికి ముగింపు పలికినట్టు భావిస్తున్నారు. ఈ మేరకు 8 మంది రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ పేషీ నుంచి తాజాగా లేఖలు వెళ్లాయని సమాచారం అందుతోంది.

Read More: మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే యూటర్న్.. మళ్లీ వైసీపీలో చేరిక..


విచారణకు హాజరు కావాలని అవకాశం ఇచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేదని స్పీకర్ లేఖల్లో వెల్లడించారు. ఈ నెల 19వ తేదీన చివరి విచారణ ఉంటుందన్నా.. హాజరు కాకపోవడాన్ని లేఖలో ప్రస్తావించారు. ఇక విచారణ ఉండదని లేఖల్లో సంకేతాలు ఇచ్చారు. అనర్హత పిటిషన్లపై నిర్ణయాన్ని ప్రకటించబోతున్నానని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రెబల్‌ ఎమ్మెల్యేలపై స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఉత్కంఠగా మారింది.

Tags

Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×