Ap Politics: కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎన్నికల ముందు రాజకీయం ఒకసారిగా వేడెక్కింది. క్యాంపు రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్న ప్రొద్దుటూరులో మరొకసారి క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. అధికార వైసీపీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు టీడీపీ చెంతకు చేరారు.
YSRCP latest updates(Ap Politics): కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎన్నికల ముందు రాజకీయం ఒకసారిగా వేడెక్కింది. క్యాంపు రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్న ప్రొద్దుటూరులో మరొకసారి క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. అధికార వైసీపీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు టీడీపీ చెంతకు చేరారు. ఆ నలుగురితో కౌన్సిలర్లను గుట్టుచప్పుడు కాకుండా ఎవరికి తెలియని ప్రదేశంలో టీడీపీ నేతలు క్యాంపులో పెట్టారు. మరి కొంతమంది వైసీపీకి చెందిన కౌన్సిలర్లు అదే బాటలో ఉన్నారని సమాచారం.
ఇప్పటికే కొద్దిరోజులుగా ఎమ్మెల్యేపై అసమ్మతితో నలుగురు కౌన్సిలర్లు దూరంగా ఉంటూ మర్శలు చేస్తున్నారు. ఇప్పుడు మరో నలుగురు కౌన్సిలర్లు టీడీపీ పంచన చేరడంతో నష్టం జరుగుతుందని గ్రహించిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తమ కౌన్సిలర్లను కాపాడుకునే పనిలో పడ్డారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతలు ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టడంతో ప్రొద్దుటూరు వైసీపీలో ఒక్కసారిగా కలకలం రేగింది. మరి ఆ షాడో కౌన్సిలర్లలు ఎవరు?