Shocking news for Jagan: ఇటీవలే జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓటమిని చవిచూసిన జగన్ మోహన్ రెడ్డికి వరుసగా షాక్ ల మీద షాక్ లు తలుగుతున్నాయి. తాజాగా జగన్ మోహన్ రెడ్డికి ఏపీ పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. ఏపీలోని తాడేపల్లిలో ఉన్న వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయానికి పోలీసులు బుధవారం నోటీసులు అంటించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి రోజు సీసీ ఫుటేజ్ సమర్పించాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనకు సంబంధించిన కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. అందులో భాగంగా వైసీపీ ఆఫీసుకు నోటీసులు పంపించారు. దాడి జరిగిన రోజు వైసీపీ ఆఫీస్ నుంచి ఎవరెవరు బయలుదేరారనేది తెలుసుకునేందుకు ఫుటేజ్ ఇవ్వాలంటూ పోలీసులు ఆ నోటీసులు అంటించారు. 2021 అక్టోబర్ 19 రోజు నాటి సీసీ ఫుటేజ్ ను తమ సమర్పించాలంటూ ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు.
Also Read: ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే కీలక వ్యాఖ్యలు చేసిన బొత్స.. కేసుల కోసం ప్రస్తావిస్తూ..
ఇదిలా ఉంటే.. ఇదే ఘటనకు సంబంధించి వైసీపీ నేత దేవినేని అవినాష్ కు కూడా పోలీసులు నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. గుణదలలోని ఆయన ఇంటికి నోటీసులను అంటించారు. తాము చెప్పిన రోజు విచారణకు రావాల్సిందిగా అందులో పేర్కొన్నారు.