EPAPER
Kirrak Couples Episode 1

AP: బిల్లులన్నీ చెల్లిస్తాం.. ఉద్యోగుల దెబ్బకు దిగొచ్చిన సర్కార్.. సీపీఎస్‌పై తగ్గేదేలే..

AP: బిల్లులన్నీ చెల్లిస్తాం.. ఉద్యోగుల దెబ్బకు దిగొచ్చిన సర్కార్.. సీపీఎస్‌పై తగ్గేదేలే..

AP: ఏపీ సర్కారు చాలా తెలివిగా వ్యవహరించింది. పీఆర్సీ, పెండింగ్‌ డీఏలు, సీపీఎస్ రద్దుపై చర్చించకుండా.. ఉద్యోగుల మిగతా సమస్యలకు మాత్రం శుభం కార్డు వేసింది. మార్చి నెలాఖరు నాటికి.. 3వేల కోట్ల బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అయినా, ఉద్యమ కార్యచరణపై వెనక్కి తగ్గలేదు ఉద్యోగ సంఘాలు. తమ ప్రధాన డిమాండ్లు నెరవేరిస్తే.. అప్పుడు చూస్తాం అన్నట్టు చెప్పారు.


సచివాలయంలో మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల నేతల సమావేశం జరిగింది. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ తదితర సంఘాలను మాత్రమే ఈ భేటీకి ఆహ్వానించారు. ఈసారి కూడా కేఆర్‌ సూర్యనారాయణ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని చర్చలకు పిలవకుండా పక్కనపెట్టేసింది ప్రభుత్వం.

ఉద్యోగుల పీఎఫ్‌ పెండింగ్‌ బిల్లులన్నీ ఈ నెలలోనే క్లియర్‌ చేస్తామని సర్కార్ తరఫున మంత్రులు హామీ ఇచ్చారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్ర ఆదాయం తీవ్రంగా దెబ్బతిందని, అందుకే ఉద్యోగులకు చెల్లింపులు చేయలేకపోయామని ప్రభుత్వ సలహాదారు సజ్జల అన్నారు. ఉద్యోగుల సమస్యలపై రెండు మెట్లు దిగే చర్చలు జరుపుతున్నామని చెప్పారు.


అయితే, సీపీఎస్‌ రద్దుపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వలేదని.. తమ ఉద్యమ కార్యాచరణ యధావిధిగా ఉంటుందని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. త్వరలో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుని ఉద్యమ కార్యాచరణ కొనసాగింపుపై చర్చిస్తామన్నారు.

Related News

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

Ysrcp: జనంపై కోపంతో ‘వరద’లకు దూరం.. జగన్ కటాక్షం కోసం అజ్ఞాతం వీడారా?

SIT Inquiry on Tirumala laddu: తిరుమల లడ్డు.. సిట్ దర్యాప్తు ఎంత వరకొచ్చింది? అరెస్టులు ఖాయమా?

YS Jagan: బెడిసికొట్టిన జగన్ ప్లాన్.. అడ్డంగా దొరికాడు?

Posani: డర్టీ పాలిటిక్స్.. రంగంలోకి పోసాని, వైసీపీకి ఇక వాళ్లే దిక్కా?

BjP vs DMK: డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్.. భగ్గుమన్న దగ్గుబాటి పురంధేశ్వరి

Tirumala Laddu: లడ్డూ వివాదంతో శ్రీవారి ప్రతిష్ట మసకబారిందా? భక్తుల మనస్సులో లక్ష ప్రశ్నలు

Big Stories

×