vidadala rajini : బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తప్పుడు పత్రాలతో ఓటు హక్కు దరఖాస్తు కోసం విడదల రజిని తప్పుడు చిరునామా ఇచ్చారని టీడీపీ నేతలు ఆరోపించారు. గుంటూరులో ఓ ఖాళీ స్థలం చిరునామాతో రజని దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయం పై టీడీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. మంత్రిగా ఉండి తప్పుడు పత్రాలతో దరఖాస్తు చేశారని టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేశారు.
గుంటూరులో మంత్రి రజినికి ఓటు హక్కు ఇవ్వకూడదని టీడీపీ నేతలు అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం రజిని చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సమన్వయకర్తగా వైసీపీ ఆమెను నియమించింది. ఈ నేపథ్యంలో ఆమె గుంటూరులో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారని సమాచారం.