AP DSC New Schedule 2024(AP news today telugu): ఏపీ డీఎస్సీ షెడ్యూల్ మారింది. ఉపాధ్యాయ నియామక పరీక్షల కొత్త తేదీలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ప్రకటించారు. మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.
తొలుత ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మార్చి 15 నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష .. టెట్ కు డీఎస్సీకి మధ్య గడువు ఉండాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
టెట్ కు డీఎస్సీకు మధ్య నాలుగు వారాలు గుడువు ఉండాల్సిందేనని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం డీఎస్సీ షెడ్యూల్ ను మార్చింది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు రెండు దశల్లో సెకండరీ గ్రేడే టీర్ పోస్టులకు ఎగ్జామ్ నిర్వహిస్తారు.
Read More : ఏపీపీఎస్సీ గ్రూపు 1 హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి.
ఏప్రిల్ 7న ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ , పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్, ప్రిన్సిపల్ పోస్టులకు ఇంగ్లీష్ ప్రావీణ్య పరీక్ష జరగనుంది. ప్రిన్సిపల్, స్కూల్ అసిస్టెంట్, పీజీటీ, పీజికల్ డైరెక్టర్ పరీక్షలు ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 నిర్వహిస్తారు.
మార్చి 20 నుంచి ఎగ్జామ్ సెంటర్ల ఎంపిక కోసం అభ్యర్థులు వెబ్ ఐచ్ఛికాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 25 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఇదే తొలి డీఎస్సీ కావడం విశేషం. ఎన్నికలకు ముందు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడంపైనా విమర్శలు వ్యక్తమయ్యాయి.