ఏపీలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వేగంగా అడుగులు వేస్తోంది. ఇవాళ ఆంధ్రరత్న భవన్ లో మేనిఫెస్టో కమిటీ సమావేశం నిర్వహించనుంది. పల్లంరాజు అధ్యక్షతన 11 మంది సభ్యులతో కూడిన మేనిఫెస్టో కమిటీ సమావేశం జరగనుంది. అన్ని పార్టీల కంటే ముందుగా మేనిఫెస్టో ప్రకటించాలని ఏపీ కాంగ్రెస్ భావిస్తోంది. ప్రత్యేకహోదా, విభజన హామీలు, సీపీఎస్ రద్దు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేతతో పాటు పలు సంక్షేమ పథకాలను మేనిఫేస్టోలో పెట్టేలా సూచనలు కమిటీ చేయనుంది.
మరోవైపు.. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలను నిరుద్యోగులు, విద్యార్థులు, కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు కలిశాయి. తమ సమస్యలను వివరిస్తూ మేనిఫెస్టోలో అంశాలను పెట్టాలని కోరారు. తెలంగాణ తరహాలో గ్యారెంటీలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కమిటీ నివేదకను షర్మిల పరిశీలించనున్నారు. మార్పులు చేర్పుల అనంతరం ఏఐసీసీకి మేనిఫెస్టో నివేదక అందజేయనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే మేనిఫెస్టో ఫైనల్ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలలో రాహుల్ గాంధీ చేత మేనిఫెస్టో, హమీలపై ప్రకటన చేయించాలని ఏపీసీసీ నేతలు భావిస్తున్నారు.
AP Congress, Apcc chief Ys Sharmila, Congress manifesto committee,